హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ముగ్గురు మరణించగా, 278 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,06,339కు చేరాయి. ఇందులో 3,00,156 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 1688 మంది మహమ్మారి వల్ల మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 4495 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 1979 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 154 ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.06 శాతం, మరణాల రేటు 0.55 శాతం ఉన్నదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న 57,942 మందికి కరోనా పరీక్షలు చేశారు. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,00,19,096కు చేరింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో కొత్తగా 62 వేల కరోనా కేసులు
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు