హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)/హన్మకొండ: వరంగల్ అర్బ న్, రూరల్ జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీరించి హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం తుది ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి అమలులోకి వస్తుంది. అర్బన్ జిల్లా హన్మకొండగా, రూరల్ జిల్లా వరంగల్గా ఏర్పాటయ్యాయి. ఇప్పటివరకు వరంగల్ రూర ల్ జిల్లా కింద ఉన్న పరకాల డివిజన్ (పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూర్, శాయంపేట మండలాలు) మొత్తా న్ని హన్మకొండ జిల్లాలోకి మార్చారు. వరంగల్ రెవెన్యూ డివిజన్ను హన్మకొండ రెవెన్యూ డివిజన్గా మార్పుచేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలోఉన్న వరంగల్, ఖిలా వరంగల్ మండలాలను వరంగల్ జిల్లాలో కలిపారు.
ఈ రెండు మండలాలతోపాటు గతంలో వరంగల్ రూరల్ జిల్లా రూరల్ డివిజన్ కింద ఉన్న సంగెం, గీసుకొండ, వర్దన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాలు కలిపి వరంగల్ డివిజన్ను ఏర్పాటుచేశారు. రూరల్ జి ల్లా కింద ఉన్న నర్సంపేట డివిజన్ మొ త్తాన్ని వరంగల్ జిల్లాలో కొనసాగించారు. ఇలా హన్మకొండ, పరకాల రెవె న్యూ డివిజన్లతో హన్మకొండ జిల్లా.. వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్ల తో వరంగల్ జిల్లాను ఏర్పాటుచేశారు. జూలై 12న ఈ రెండు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదలయింది. అభ్యంతరాలు, సూచనలు పరిగణనలోకి తీసుకున్న సర్కారు నెల తర్వాత తుది గెజిట్ ఉత్తర్వులు జారీచేసింది. హన్మకొండ జిల్లాల్లో 2 రెవెన్యూ డివిజన్లు,14 మండలాలు,163 రెవెన్యూ గ్రామాలు, వరంగల్ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 13 మండలాలు, 192 రెవెన్యూ గ్రామాలున్నాయి.
వరంగల్లో సంబురాలు
జీవో జారీపై టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు క్షీరాభిషేకం చేశారు. పోచమ్మమైదాన్ సెంటర్లో ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వరంగల్, హన్మకొండ పేర్లమీద కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వం నవశకానికి నాం ది పలికిందని రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్చైర్మన్ బీ వినోద్ పేర్కొన్నారు.