హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనున్నది. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, పని ప్రదేశాలకు టీకా క్యాంపులు తరలిరానున్నాయి. అదే సమయంలో సూపర్ స్ప్రెడర్లకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, వ్యాక్సిన్లు ఇవ్వనున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు దవాఖానల్లో టీకాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవి విద్యాసంస్థలు, కంపెనీలు వంటి పని ప్రాంతాలు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి, టీకా పంపిణీ చేయవచ్చని పేర్కొన్నది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కొవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే టీకాలు వేయాలని స్పష్టంచేసింది. 18 ఏండ్లు నిండినవారందరికీ టీకాలు వేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ప్రక్రియను జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి పర్యవేక్షిస్తారని పేర్కొన్నది.
ఇవీ మార్గదర్శకాలు..