హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): వీసీల రాకతో యూనివర్సిటీలు కొత్తకళను సంతరించుకొంటున్నాయి. యూనివర్సిటీల్లో నెలకొన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. స్తబ్దతకు తెరపడింది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు వైస్చాన్స్లర్ల నియామకంలో ప్రభుత్వం అనుభవం, సమర్థతకు పెద్దపీట వేసింది. దాంతో వర్సిటీలు కొత్తపుంతలు తొక్కనున్నాయి. గత కొంతకాలంగా యూనివర్సిటీలకు ఐఏఎస్ అధికారులే వీసీలుగా ఉన్నారు. వీరు రెండుమూడు పోస్టుల్లో ఉండటంతో వర్సిటీల పరిపాలనలో స్తబ్దత నెలకొన్నది. కొత్త వీసీల రాకతో ఆ పరిస్థితుల్లో మార్పులు రానున్నాయి. వర్సిటీల్లోని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వీటికి పరిష్కారాలు దొరికే చాన్స్
బాధ్యతలు స్వీకరించిన నలుగురు వీసీలు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్తగా నియమితులైన వైస్చాన్స్లర్లలో పలువురు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. తెలుగు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ తంగెడ కిషన్రావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ కుసుంబ సీతారామారావు, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి ఆదివారమే బాధ్యతలు స్వీకరించారు. ఇక ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీలకు కొత్తగా నియమితులైన వీసీలు డీ రవీందర్యాదవ్, సీహెచ్ గోపాల్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. శాతవాహన, పాలమూరు, జేఎన్ఏఎఫ్ఏయూ, తెలంగాణ యూనివర్సిటీవీసీలు సైతం సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
పాలమూరు వర్సిటీ వీసీకి మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు
పాలమూరు యూనివర్సిటీ వైస్చాన్స్లర్గా నియమితులైన ప్రొఫెసర్ లక్ష్మికాంత్ రాథోడ్ను రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖమంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం అభినందించారు. సీఎం కేసీఆర్ ఎంతోనమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యూనివర్సిటీని అన్నివిధాలా ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతీ విద్యార్థిని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్ది రాష్ర్టానికి, యూనివర్సిటీకి మంచి పేరు తేవాలని సూచించారు.