హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదలచేసింది. ఆయా జిల్లాలకు మంజూరైన పోస్టు ల ఆధారంగా ఉద్యోగులను కేటాయిస్తారు. ఇందుకోసం ఇప్పటికే ఉద్యోగులు ఆప్షన్లు ఇస్తుండటంతో మంగళవారం మార్గదర్శకాలను విడుదలచేసింది. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న జిల్లా/జోనల్/మల్టీజోనల్ ఉద్యోగులను అదే క్యాడర్లో కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను ఆయా జిల్లా/జోనల్/మల్టీజోనల్లో కేటాయించిన నిష్పత్తిలో విభజిస్తారు. అర్హులైన ఉద్యోగుల నుం చే లోకల్ క్యాడర్కు దరఖాస్తులు స్వీకరిస్తారు. జిల్లాకు మంజూరైన పోస్టులకన్నా ఎక్కువ వినతులొస్తే సీనియారిటీ, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, బుద్ధిమాంధ్యతం పిల్లలున్న ఉద్యోగులు, భార్యాభర్తలకు ప్రాధాన్యం ఇస్తారు.
ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ చరిత్రాత్మకం
రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఉద్యోగులను పునర్వ్యవస్థీకరించడం చరిత్రాత్మక పరిణామమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పేర్కొన్నది. ఉద్యోగులను 33 జిల్లా, 7 జోనల్, 2 మల్టీ జోనల్ క్యాడర్లుగా ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపింది. జోనల్ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై జేఏసీ నేత లు మామిళ్ల రాజేందర్, వీ మమత, రాయికంటి ప్రతాప్, ఏ సత్యనారాయణ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్కు కలిశారు. వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) సూచన మేరకు ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఒక శా తం చందాతో ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అన్ని కార్పొరేట్ దవాఖానల్లో చలామణీ అయ్యేలా ఉత్తర్వులు జారీచేయాలని విన్నవించారు. సమావేశంలో జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, జీఏడీ ఓఎస్డీ అప్పారావు, హెచ్ఆర్ఎం, ఎస్ఈఎం సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్, ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి రవి, హోంశాఖ ఎస్వో వనజ, జాయింట్ సెక్రటరీ సర్వీసెస్-సునీత, సీఎం కార్యదర్శి ఓఎస్డీ కృష్ణమూర్తి, ఉద్యోగ సంఘాల నేతలు కస్తూరి వెంకటేశ్వర్లు, రా మినేని శ్రీనివాసరావు, ముజీబ్, శ్రీరామ్, లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, గోవర్ధన్రెడ్డి, కృష్ణ యా దవ్, జీ వెంకటేశ్వర్లు, లక్ష్మణ్గౌడ్, రాజ్కుమార్గుప్తా తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక కమిటీలు
ఉద్యోగుల విభజనకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలు వేసి నిర్ణీత గడువును విధించింది. జిల్లా క్యాడర్ పోస్టుల విభజనకు ఉమ్మడి జిల్లా కేం ద్రం కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేశారు. అందులో నూతన జిల్లాల కలెక్టర్లు, విభాగాల అధిపతులు ఉంటారు. జోనల్ పో స్టుల విభజన బాధ్యతను ఆయా విభాగాల అధిపతులకు అప్పగించారు. మల్టీజోనల్ పోస్టులకు ఆయా శాఖ ల కార్యదర్శులు నిర్ణయం తీసుకోనున్నారు. క్యాడర్ స్ట్రెంత్ను గుర్తించేందుకు మూ డురోజులు, వర్కింగ్ స్ట్రెంత్ను నిర్ణయించేందుకు రెండురోజులు, ఉద్యోగుల ఆప్షన్లను పరిశీలించేందుకు రెండురోజులు, వాటి ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేసేందుకు 10 రోజుల గడువు విధించింది.