వరంగల్ రూరల్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): సాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా రామప్ప- రంగాయ, రామప్ప- పాకాల అనుసంధాన ప్రాజెక్టులతో మరో అరుదైనఘట్టాన్ని ఆవిష్కరించింది. కృష్ణా బేసిన్లోకి గోదారమ్మను చేర్చింది. రామప్ప రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు పాకాల సరస్సులోకి పారాయి. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గ పరిధిలో డబ్బువేల ఎకరాలకుపైగా ఎస్సారెస్పీ గ్యాప్ ఆయకట్టు ఉన్నది. దీనికి జే చొక్కారా వు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను అందించేందుకు ప్రభు త్వం రామప్ప- రంగాయ (ప్యాకేజీ-5), రామప్ప-పాకాల ఎత్తిపోతల ప్రాజెక్టుల ని ర్మాణం చేపట్టింది. దేవాదుల ప్రాజెక్టు మూడోదశలో ములుగు జిల్లాలోని రామప్ప బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించేలా డిజైన్ చేసింది. ఇవి రెండు పరస్పర అనుసంధాన ప్రాజెక్టులు కావడం విశేషం. ఒక ప్రాజెక్టుతో మరో ప్రాజెక్టుకు నీటిని తరలించే అవకాశం ఉండటం వీటి ప్రత్యేకత. చారిత్రక పాకాల సరస్సులోకి గోదావరి జలాలు ఇవ్వాలనే నర్సంపేట నియోజకవర్గ ప్రజల నూరేండ్ల కోరికను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసింది.
రామప్ప వద్ద పంపుహౌస్లు
దేవాదుల ప్రాజెక్టు మూడోదశలో రామప్ప చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మారిం ది. కన్నాయిగూడెం మండలంలోని గంగారం వద్ద నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు ఇన్టేక్వెల్ నుంచి ఎత్తిపోతలతో గోదావరి నీళ్లు భూపాలపల్లి మండలంలోని బీం ఘణపురం రిజర్వాయర్ ద్వారా రామప్ప రిజర్వాయర్కు చేరుతాయి. అక్కడి నుంచి ఎత్తిపోతతో రామప్ప-రంగాయ చెరువు, రామప్ప- పాకాల ప్రాజెక్టులకు తరలించేందుకు ములుగు సమీపంలోని రంగారావుపల్లి వద్ద రెండు పంపుహౌస్లు నిర్మించారు. ప్రతి పంపుహౌస్లో రెండేసి మో టర్లు ఏర్పాటుచేసి రెండు ప్రాజెక్టులను అనుసంధానం చేశారు. ఒక ప్రాజెక్టులో ఎత్తిపోత జరిగితే మరో ప్రాజెక్టుకు రామప్ప రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేలా పైపులైన్ నిర్మించారు.
ప్రస్తుతం రామ ప్ప- రంగాయ ప్రాజెక్టు పంపుహౌస్లోని రెండు మోటర్ల ద్వా రా రంగాయ చెరువులోకి ఎత్తిపోస్తున్నారు. రామప్ప- పాకాల ప్రాజెక్టు ఎత్తిపోతలు ప్రారంభమైతే రామప్ప రిజర్వాయర్ నుంచి నేరుగా గోదావరి నీరు పాకాల సరస్సులోకి చేరుతాయి. అనుసంధానమైనది కావడంతో రామప్ప- రంగాయ ప్రాజెక్టు పైపులైన్ ద్వారా కొద్దిరోజుల క్రితం నల్లబెల్లి మండలం గొల్లపల్లి సమీపంలోని దబ్బవాగులోకి గోదావరి జలాలను వదిలారు. అవి నేరుగా పాకాల సరస్సులోకి చేరుతున్నాయి. రామప్ప- పాకాల ప్రా జెక్టు పనులు పూర్తయ్యేలోగా పాకాల సరస్సు కింద యాసంగి పంటకు నీరిచ్చేందుకు ఏర్పాట్లుచేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాకాల వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులు సంబురాలు జరుపుకొంటున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు.
జన్మజన్మల అదృష్టం
కాకతీయులు నిర్మించిన పాకాల సరస్సుకు ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉన్నది. పాకాలకు గోదావరి జలాలను తరలించాలనేది నర్సంపేట ప్రజల చిరకాల కోరిక. సీఎం కేసీఆర్ కృషితో వందేండ్ల కల సాకరమైంది. రెండు ప్రాజెక్టులను మంజూరుచేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. రామప్ప- రంగాయ, రామప్ప- పాకాల ప్రాజెక్టుల డిజైన్, నిర్మాణం, ప్రారంభంలో నా పాత్ర ఉండటం జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నా.