రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్ధిక, సామాజిక సమస్యలుగా విడదీసి గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వాటి పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతానికి అమలులోఉన్న స్కీమ్లను కొనసాగిస్తూనే.. సీఎం దళిత సాధికారత పథకాన్ని వర్తింపజేయనున్నట్టు తెలిపారు. ఎస్సీ కుటుంబాల ప్రొఫైల్ తయారుచేయాలని ఎస్సీ సంక్షేమశాఖమంత్రి కొప్పుల ఈశ్వర్కు సూచించారు.