కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. శాస్త్రీయ ఆధారాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనివల్ల ఎటువంటి సమస్యలు ఉండవని స్పష్టంచేసింది. ప్రస్తుతం కొవిషీల్డ్ డోసుల మధ్య 6-8 వారాల వ్యవధిని పాటిస్తున్నారు. తాజాగా దీనిని పెంచారు. కొవాగ్జిన్ టీకా విషయంలో మాత్రం ఇప్పుడున్న 6-8 వారాల వ్యవధినే కొనసాగించనున్నారు. మరోవైపు, కరోనా నుంచి కోలుకున్నవారు ఆరు నెలల తర్వాత టీకా వేయించుకోవాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.
న్యూఢిల్లీ, మే 13: కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచటానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. శాస్త్రీయ ఆధారాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనివల్ల ఎటువంటి సమస్యలు ఉండవని స్పష్టంచేసింది. ప్రస్తుతం కొవిషీల్డ్ డోసుల మధ్య 6-8 వారాల వ్యవధిని పాటిస్తున్నారు. కొవాగ్జిన్ టీకా విషయంలో మాత్రం ఇప్పుడున్న 6-8 వారాల వ్యవధినే కొనసాగించనున్నారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఇమ్యునైజేషన్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్’ (ఎన్టీఏజీఐ) చేసిన సిఫార్సులకు ఆమోదం లభించింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది.
తాజా ఆధారాలకు అనుగుణంగా..
తాజాగా లభించిన సాక్ష్యాధారాలను బట్టి ముఖ్యంగా బ్రిటన్లో జరిగిన అధ్యయనాల మేరకు టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచాలని ఎన్టీఏజీఐ సిఫార్సు చేసినట్లుగా సంబంధితవర్గాలు వెల్లడించాయి. అలాగే, దేశంలో భారీ ఎత్తున కరోనా టీకాలకు కొరత నెలకొన్న నేపథ్యమూ వ్యవధి పెంపునకు ఒక కారణమని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు నీతిఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు వీకేపాల్ సమాధానమిస్తూ.. కొవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధిని మరోసారి పెంచాలన్నది ఎన్టీఏజీఐ స్వతంత్రంగా, సైన్స్ ఆధారంగా తీసుకున్న నిర్ణయమని, దీనిని అందరమూ గౌరవించాలన్నారు. ఇది ఎప్పటికప్పుడు సమీక్షల ద్వారా మారే నిర్ణయమేనన్నారు. వ్యవధిని పెంచటం ద్వారా వ్యాక్సిన్ పనితీరుపై ప్రభావం పడుతుందా అని ప్రశ్నించగా.. అది సమస్యే కాదని, సింగిల్ డోసు తీసుకున్నా కూడా టీకా ఎంతో బాగా పని చేస్తున్నదని వెల్లడించారు.
ఆమోదంపై కొరవడిన స్పష్టత
కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసుల వ్యవధికి సంబంధించిన సిఫార్సులను జాతీయ నిపుణుల బృందం ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశాఖ తాజా ప్రకటన చేసింది. కానీ, ఇతర సిఫార్సులను కూడా ఆమోదించారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు.
ఇతర సిఫార్సులు..