వనపర్తి, ఏప్రిల్ 9 : మాస్క్ ధరించకుండా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న వనపర్తి జడ్పీ చైర్మన్కు మున్సిపల్ అధికారులు రూ.వెయ్యి జరిమానా విధించారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ రాములుతోపాటు జడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి హాజరయ్యారు. ఆ సమయంలో బహిరంగ ప్రదేశంలో మాస్కు లేకుండా కార్యక్రమాల్లో పాల్గొన్న జడ్పీ చైర్మన్కి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి జరిమానా విధించారు. అనంతరం జరిమానాను జడ్పీ చైర్మన్ చెల్లించారు.
భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లో మూడు చెక్పోస్టులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎడపల్లి, టేకుమట్ల మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామాలను కంటోన్మెంట్ జోన్లుగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రకటించారు. సరిహద్దు రాష్ర్టాల నుంచి జిల్లాలో కరోనా వైరస్ ప్రబలకుండా అరికట్టేందుకు మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. మహదేవపూర్లో 2, కాటారం మండలంలో ఒక చెక్ పోస్టును ఏర్పాటు చేసి మహారాష్ట్ర నుంచి వచ్చేవారిపై ప్రత్యేక నిఘా పెట్టారు.