హైదరాబాద్ : యువత ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..యవ్వనం తిరిగిరాని గొప్ప అనుభూతి అన్నారు. యువకుడిగా ఉన్నప్పటి నాటి తమ గత స్మృతులను మంత్రి గుర్తు చేసుకున్నారు. తాను చదువుతున్న రోజుల నాడే, క్రీడాకారుడిగా స్ఫూర్తి దాయకంగా నడుచుకునే వాడినని అన్నారు. అయితే, నిజమైన సేవ, ప్రజా జీవితం లోనే చేయ వచ్చని రాజకీయాల్లోకి వచ్చామన్నారు.
దేశం 35.6 కోట్ల మంది యువతతో ప్రంపంచం లో మొదటి స్థానంలో వుందన్నారు. యూత్ ఎక్కువగా వున్న మన దేశంలో యువతకు మరిన్ని విద్య, శిక్షణ, ఉపాధి నైపుణ్యాలు అందించాల్సిన అవసరం వుందన్నారు. అన్ని దేశాల్లో యువతను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఆగస్టు12న అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం అని మంత్రి వివరించారు.
మన దేశంలో ప్రతి ఏటా లక్ష మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న వారిలో 60% మంది సరైన అవగాహన నైపుణ్యాలు లేకుండా బయటకు వస్తున్నారని అన్నారు. ఈ సమయంలో నూతన టెక్నాలజీ, నేటి ఆధునిక కాలానికి కావాల్సిన విజ్ఞానాన్ని, జీవన స్థితులు పెంచుకోవడం కోసం యువత సిద్ధంగా ఉండాలి అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. పాలకుర్తి నియోజక వర్గంలో యువత అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : ఆరెగూడెంలో వృద్ధ దంపతుల బలవన్మరణం
ఈ హీరో రాకతో ఎగిరి గంతేసిన మీరాబాయి చాను.. ఎవరా హీరో తెలుసా?
Olympic First Gold : ఒలింపిక్స్లో భారత్కు తొలి బంగారు పతకం.. ఏదంటే..?