మూడేళ్ల క్రితం తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన కన్నడ సోయగం రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాది అగ్ర కథానాయికగా ఎదిగింది. రష్మిక మందన్న బాలీవుడ్లో నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘గుడ్బై’. వికాస్భల్ దర్శకుడు. ఈ సినిమాలో బిగ్బి అమితాబ్బచ్చన్తో కలిసి నటిస్తోంది రష్మిక మందన్న. కెరీర్ తొలినాళ్లలోనే అమితాబ్బచ్చన్ వంటి లెజెండ్తో తెరను పంచుకోవడం గొప్పగౌరవంగా భావిస్తున్నానని చెప్పింది రష్మిక మందన్న. ‘షూటింగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. నా కెరీర్లో మరపురాని అనుభూతుల్ని మిగిల్చే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది. అమితాబ్ సర్ నుంచి కొత్త విషయాలు తెలుసుకోవాలనుంది’ అని చెప్పింది రష్మిక మందన్న.