న్యూఢిల్లీ, మే 28: కరోనా చికిత్సలో గేమ్చేంజర్గా మారుతుందని భావిస్తున్న 2డీజీ ఔషధం ధరలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రకటించింది. ఒక్కో సాచెట్ ధర రూ.990గా నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దవాఖానలకు మాత్రం డిస్కౌంట్ ధరలకు లభించనున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. అయితే తగ్గింపు ఎంతన్నది మాత్రం స్పష్టంచేయలేదు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సహకారంతో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు (డీఆర్డీవో) చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్’ (ఇన్మాస్) ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. హైదరాబాద్లోని సీసీఎంబీ కూడా సహకారం అందించింది.