ఖమ్మం : ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్ డిప్యూటీ మేయర్ పదవులకు శుక్రవారం ఎన్నిక జరగనుంది. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ బారినపడిన కార్పొరేటర్ల కు వీడియో కాల్ ద్వారా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు. ఎన్నిక కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి పరిశీలకులుగా హాజరు కానున్నారు.
ఇవి కూడా చదవండి..
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
అంబులెన్స్లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం