హైదరాబాద్: సైబర్ మోసగాళ్ల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. విమానాశ్రయంలో ఉద్యోగమంటూ ఓ యువతికి రూ.లక్ష టోకరా ఇచ్చారు. ఓ నిరుద్యోగ యువతి.. ఉద్యోగం కోసం జాబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నది. దీని ఆధారంగా క్వికర్ డాట్ కామ్ నుంచి అంటూ సైబర్ మోసగాళ్లు ఆ యువతికి ఫోన్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ.లక్షలకుపైగా తమ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. కాగా, ఇంకా ఉద్యోగం జాడే లేకపోవడంతో ఆమె నిందితులకు ఫోన్ చేసింది. అయితే ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తున్నది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన యువతి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.