మెదక్ : సరాదాగా స్నేహితులతో కలిసి చెరువులో ఈతకొట్టేందుకు దిగి యువకుడు గల్లంతయ్యాడు. మెదక్ జిల్లా కొంటూర్లో ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్లోని ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు గురువారం ఉదయం మెదక్ చర్చి చూసేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5 గంటల సమయంలో కొంటూర్ చెరువు వద్ద ఆగారు.
సరదాగా ఈత కొట్టేందుకు అందరూ చెరువులోకి దిగారు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మునగాల జట్లి(24), శాంసన్ అనే ఇద్దరు యువకులు నీట మునిగారు.
స్థానికులు శాంసన్ను అతికష్టం మీద కాపాడగా జట్లి నీటిలో గల్లంతయ్యాడు. మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.