నాగర్కర్నూల్ : జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం పాతాలగంగ వద్ద కృష్ణానదిలో పడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పాతాళగంగ స్నానాల ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు యువకుడు కృష్ణానదిలో జారిపడ్డాడు. గల్లంతైన యువకుడు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన రఫిగా గుర్తింపు. స్నేహితులతో కలిసి శ్రీశైలం ప్రాజెక్టు చూసేందుకు వచ్చినట్లు సమాచారం. యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.