చిట్యాల, మే 14: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్కు చెందిన డబ్బాల రాజేశ్ (23)కు ఈ నెల 26న వివాహం కావాల్సి ఉంది. నాలుగు రోజుల క్రితం అతడికి కరోనా పాజిటివ్ రాగా, హోమ్ ఐసొలేషన్లో ఉన్నాడు. ఈ క్రమంలో శ్వాస ఇబ్బందితో తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం ఉదయం చిట్యాల దవాఖానకు తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు.