హైదరాబాద్ : మల్కాజ్గిరి పోలీస్స్టేషన్ పరిధిలోని జెడ్టీసీ క్రాస్రోడ్ వద్ద విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు షాక్కు గురై ఓ ఓ యువకుడు మృతి చెందారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా తేజేశ్వర్రావు (22)గా గుర్తించారు. యువకుడు మౌలాలి సబ్స్టేషన్లో కాంటాక్టు కార్మికుడిగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇవాళ మరమ్మతుల నిమిత్తం 11కేవీ విద్యుత్ స్తంభం ఎక్కాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణం బలైందని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించారు.