గజ్వేల్ అర్బన్, మే 29: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో తల్లీకొడుకు కరోనాతో ఇబ్బంది పడుతున్నారని ఓ పత్రికలో వచ్చిన వార్తలో వా స్తవం లేదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి స్పష్టంచేశారు. ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో గ్రామానికి చెందిన ఎడమ ఎల్లవ్వ, ఆమె కొడుకు పరశురాం నివసిస్తున్నారు. ఎల్లవ్వ వృద్ధాప్యం కారణంగా అస్వస్థతతో బాధపడుతున్నది. కొడుకు పరశురాం కూడా నీరసంగా ఉన్నారు. ఇంట్లో వారికి సపర్యలు చేసేవారు లేక భోజనానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో వారి ఆరోగ్యం క్షీణించింది. నాలుగు రోజుల కిందటే సర్పంచ్ భాగ్య భిక్షపతి సమాచారం మేరకు వైద్యు లు సిద్దిపేటలో కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది.
విషయం తెలుసుకున్న ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి శనివారం గ్రామానికి చేరుకుని తల్లీకొడుకును పరామర్శించారు. మరోసారి శనివారం కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. వారికి ఎవరూ తోడు లేకపోవడంతో గజ్వేల్ ఏరియా దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం అం దించాలని ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి. అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వారి కు టుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటుందని హామీఇచ్చారు. ఇంటింటి జ్వర సర్వేలో అనారోగ్య లక్షణాలుంటే ప్రభుత్వం మెడికల్ కిట్లను అందజేస్తున్నదని, లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని సిద్దిపేట దవాఖానకు తరలిస్తున్నట్టు వెల్లడించారు. వాస్తవా లు తెలుసుకోకుండా అబద్ధాల రాయ వద్దని ప్రతాప్రెడ్డి మీడియాను కోరారు.