హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కొవిడ్తో ఆరోగ్యం విషమించిన ప్రముఖ క్రీడాకారుడికి యశోద దవాఖాన వైద్యులు మెరుగైన చికిత్స అందించి ప్రాణం పోశారు. సికింద్రాబాద్లోని మల్కాజ్గిరికి చెందిన సుశీల్కుమార్ గైక్వాడ్(32) బాడీబిల్డర్గా తెలంగాణకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఏప్రిల్లో ఆయనకు కరోనా సోకడంతో స్థానిక దవాఖానలో చికిత్సపొందారు. అయినప్పటికీ ఆరోగ్యం రోజురోజుకూ విషమించింది. దీంతో కుటుంబసభ్యులు గత నెల 19న ఆయనను సినీనటుడు సోనూసూద్ సహకారంతో మలక్పేటలోని యశోద దవాఖానకు తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం సుశీల్కుమార్ కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్టు యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి తెలిపారు.