కందుకూరు, మే 12 : పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అగర్మియగూడ గ్రామానికి చెందిన కమ్మదనం ప్రభాకర్రెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.43వేల 500 చెక్కును బుధవారం సర్పంచ్ ఈర్లపల్లి భూపాల్రెడ్డితో కలిసి ఆయనకు అందజేశారు.
అదేవిధంగా కొత్తగూడ గ్రామానికి చెందిన అంబప్రసాద్కు రూ. 60వేలు, నిర్మలకు రూ. 22వేలు, అశోక్కు రూ.13వేలు, రాచులూరు గ్రామానికి ధనుంజయగౌడ్కు రూ.31వేలు, అన్నోజిగూడ గ్రామానికి చెందిన మహిపాల్గౌడ్కు రూ. 60వేలు, రాములుకు 35వేలు, మహమ్మద్నగర్ గ్రామానికి చెందిన వ్యక్తికి రూ. 60వేలు, దెబ్బడగూడ సంతోషకు రూ. 60వేలు, గుమ్మడవెల్లికి చెందిన శేఖర్కు రూ.15వేలు మంజూరు అయ్యాయి.
ఆ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి మండల కేంద్రంలో అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సురుసాని సురేందర్రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి,అన్నోజిగూడ, దన్నారం గ్రామాల సర్పంచ్లు ఇందిరమ్మ దశరథ, శ్రీదేవి శేఖర్రెడ్డి,డైరెక్టర్లు సామ ప్రకాశ్రెడ్డి, సురుసాని శేఖర్రెడ్డి పాల్గొన్నారు.