రాజాపేట: యాడున్నావ్ బిడ్డా నీవు.. నిన్ను చూడక మూడు దినాలాయె. వరదలో కొట్టుక పోయి వాగులో ఏ కంప చెట్లలల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్నావో బిడ్డా అని వాగు ఒడ్డున కూర్చొని యవతి హిమబిందు తల్లి పద్మ, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు కలిచివేసి అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టిస్తుంది. మూడు రోజుల కిందట మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకు పోయిన ఇద్దరు యువతుల్లో ఒక యువతి మృతదేహం లభ్యం కాగా మరో యువతి కోసం బుధవారం మూడవరోజు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
వరద ప్రవాహంలో గల్లంతైన మండలంలోని బొందుగులకు చెందిన యువతి హిమబిందు కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం, రెవెన్యూశాఖ, పోలీసులు, యువకులు, గ్రామస్తులు కలిసి ఘటన జరిగిన పాముకుంట దోసర వాగు నుంచి మొదలు కొని దూదివెంకటాపురం రోడ్ డ్యాం వరకు అణువణువు గాలించిన యువతి ఆచూకీ లభ్యం కాలేదు.
భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, యాదగిరిగుట్ట సీఐ నరసయ్య, తహసీల్దార్ జయమ్మ గల్లంతై న యువతి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ సీఐ యోగేశ్ కుమార్వర్మ, ఎస్సై శ్రీధర్ రెడ్డి, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్గౌడ్, గ్రామ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్రెడ్డి, పోలీస్, రెవెన్యూ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.
ఘటన జరగడం దురదృష్టకరం: ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని వరదలో కొట్టుకుపోయిన యువ తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. యువతి కోసం గాలిస్తున్న తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద ల్లో యువతులు కొట్టుకుపోవడం దురదృష్టకరమన్నారు. హిమబిందు కోసం కొన సాగుతున్న గాలింపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వరదలు ఉన్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి బ్రిడ్జి ల నిర్మాణం చేపట్టడానికి కృషి చేస్తామని తెలిపారు. ఆమె వెంట ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, నాయకులు సందిల భాస్కర్గౌడ్, పల్లె సంతోశ్గౌడ్, మోత్కుపల్లి ప్రవీణ్, రేగు సిద్ధులు, శివకుమార్, రాజు, స్వామి మల్లారెడ్డి తదితరులున్నారు.
కొలనుపాక వాగులో గాలింపు
ఆలేరురూరల్: పాముకుంట దోసర వాగులో గల్లంతైన యువతి హిమబిందు కోసం బుధవారం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, యువకులు ముమ్మరంగా గాలించారు. మండలంలోని కొలనుపాక నుంచి ధర్మారెడ్డి గూడెం వరకు వాగులో విసృత్తంగా గాలించిన యువతి ఆచూకీ లభ్యం కాలేదు. కార్యక్రమంలో ఎస్సై ఇంద్రిస్అలీ పాల్గొన్నారు.