యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం నిజాభిషేకం మొదలుకుని స్వామి వారి నిత్య కైంకర్యాలలో భక్తులు పాల్గొని తరించారు. స్వామి వారిని దర్శించుకునే భక్తులు ఉద యం నుంచే క్యూ లైన్లలో నిలుచున్నారు. పలువురు భక్తులు సువర్ణ పుష్పార్చనలో పాల్గొని స్వామివారి వేద ఆశీర్వచ నం తీసుకున్నారు. బాలాలయంలోని ప్రతిష్టా మూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు జరిపారు.
తెల్లవారుజామునే స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపారు. అనంతరం లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజ లు చేపట్టి హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలి చారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరుపుగా భక్తులు పాల్గొని తరించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వాహనంపై ముఖ మండపం లోనే ఊరేగించారు. శ్రీ లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు.
కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతు నిర్వహించారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మ వారికి కుంకుమార్చన, అంజనేయ స్వామి వారిని సహస్ర నామా ర్చన చేశారు.
సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పూర్వగిరి(పాతగుట్ట)లో లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కైంకర్యాలు సంప్రదాయబద్దంగా సాగాయి. యాదాద్రీశుడిని దర్శించుకున్న భక్తులు పాతగుట్ట నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు.