నాగర్కర్నూల్ జిల్లా: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో స్వామి వారి గోపురానికి స్వర్ణ తాపడం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో స్వర్ణగోపురం కోసం 2 కేజీల బంగారం విరాళంగా అందజేస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రకటించారు.
అలాగే యాదాద్రి దేవాలయం ఆవరణలో నిర్మిస్తున్న టెంపుల్ సిటీలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న కాటేజ్ నిర్మాణానికి కూడా విరాళం ప్రకటించారు. ఈ కాటేజ్ నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.