యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ శివాలయం ప్రధానాలయం పనులు దాదాపుగా పూర్తి కాగా, క్యూ లైన్లు, నంది, లింగం ప్రతిష్ట పనులు సాగుతు న్నాయి. హరిహరుల పుణ్యక్షేత్రంగా పునర్నిర్మితమవుతున్న యాదా ద్రిలో శివాలయానికి చెందిన రథశాలకు ప్రత్యేక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఫైబర్ మెటీరియల్తో రూపొందించిన వివిధ రకాల ఆకృతులు, దేవతామూర్తులను పొందుపరిచే పనులు సాగుతున్నాయి.
రథశాల పైభాగంలో నిర్మించిన ఫైబర్ సాలాహారాలలో నందిపై కూర్చున్న శివ పార్వతుల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. రథశాల నలమూలల శివపార్వతుల విగ్రహాలను ఎంతగానో ఆకట్టుకోనున్నాయి. శైవగామశాస్త్రం ప్రకారం రథశాలను వైటీడీఏ అధికారులు సిద్ధం చేస్తున్నారు.