యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు గురువారం రూ.6,17,728 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 58,420, రూ.100 దర్శనం టిక్కె ట్ ద్వారా 29,000, వేద ఆశీర్వచనం ద్వారా 3,612, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 2,750, వ్రత పూజలతో 16,000, కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 13,200,
ప్రసాద విక్ర యం ద్వారా 3,30,190, శాశ్వత పూజల ద్వారా 12,000, వాహన పూజలతో 7,300, టోల్గేట్ ద్వారా 710, అన్నదాన విరాళం ద్వారా 26,781, సువర్ణ పుష్పార్చన ద్వారా 55,000, యాదరుషి నిలయం ద్వారా 39,040, పాతగుట్ట నుంచి 10,495, ఇతర విభాగాల ద్వారా 12,98 0 మొత్తంగా రూ.6,17,728 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు.
రూ. 1,00,32,199 యాదాద్రీశుని హుండీల ఆదాయం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 21 రోజుల హుండీల ఆదాయం రూ. కోటి దాటిందని యాదాద్రి ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు. గురువారం యాదాద్రి కొండపైన హరిత హోటల్లో హుండీలను లెక్కించామని, నగదు 1,00, 32,199 రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పారు. మిశ్రమ బంగారం 76 గ్రాములు, మిశ్రమ వెండి రెండు కిలోల 900 గ్రాములు వచ్చిందని తెలిపారు.