యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 5,38,233 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 53,206, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 28,000, వేద ఆశీర్వచనం ద్వారా 7,740, సుప్రభాతం ద్వారా 1,600, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 2,200, వ్రత పూజలతో 16,500, కల్యాణకట్ట
టిక్కెట్ల ద్వారా 10,000, ప్రసాద విక్రయం ద్వారా 3,03,335, శాశ్వత పూజలతో 6,000, వాహన పూజల ద్వారా 2,500, టోల్గేట్ ద్వారా 940, అన్నదాన విరాళంతో 1,332, సువర్ణ పుష్పార్చన ద్వారా 74,280, యాదరుషి నిలయం ద్వారా 19,700, పాతగుట్ట నుంచి 10,900 మొత్తంగా శ్రీవారి ఖజానాకు రూ. 5,38,233 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు.