యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో రాకపోక లకు తీవ్ర ఇబ్బందుల రాకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కొండ కింద తులసీ కాటేజీ వద్ద ఉన్న 100 పడకలు వసతి గృహాం సమీపంలో పాత రోడ్డును పూర్తిగా తొలగించి నూతనంగా బీటీ వేసి ఆధునీకరిస్తున్నారు. ఈవో కార్యాలయం, వివిధ విభాగాల కార్యాలయాలతో పాటు, వసతి గృహాలకు వచ్చే భక్తుల వాహనాలను ఇబ్బందులు వాటిళ్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.