యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ పర్వా లను అత్యంత వైభవంగా జరిగాయి. భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే విష్ణు పుష్కరిణి చెంత ఉన్న హనుమంతుడి కి పంచామృతాలలో అభిషేకం, సింధూరం అలకంరణ చేపట్టారు.
తమల పాకులతో అర్చన చేపట్టారు. వేద మం త్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. లలితాపారాయణం చేసి, ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమర్పించారు.