ఫొటొరైటఫ్: 23వైడీడీ10: యాదాద్రి బాలాలయంలో స్వామివారి నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
ఫొటొరైటఫ్: 23వైడీడీ10ఏ: యాదాద్రి బాలాలయంలో స్వామివారి నిత్యకల్యాణోత్సవం పాల్గొన్న భక్తులు
ఫొటొరైటఫ్: 23వైడీడీ10బీ,10సీ: యాదాద్రి బాలాలయంలో భక్తుల సందడి
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శనివారం నిత్య పూజల సందడి కొనసాగింది. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు జరిపారు. ఉదయం నాలుగు గంటల కు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి, హారతి నివేదనలర్పించారు
ఉదయం 8గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హో మం జరిపారు. ప్రతీ రోజు నిర్వహించే నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు.
లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సు మారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. కల్యాణ మూర్తు లను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతు నిర్వహించారు. దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి.
సాయంత్రం అమ్మవారికి కుంకు మార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామి వారికి జరిగిన పూజల్లో కూడా భక్తులు పాల్గొన్నారు. వ్రత మండపంలో సత్యనారాయ ణస్వామి వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామి వారికి నిత్య కైంకర్యాలు శాస్ర్తోక్తంగా సాగాయి. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.