న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఇన్సూరెన్స్ సంస్థలను బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ శుక్రవారం మరోసారి కోరింది. పాలసీదారుల్లో కొవిడ్-19 వ్యాక్సిన్పై అవగాహనను పెంచాలన్నది. 60 ఏండ్లు, ఆపై వయసున్నవారితోపాటు రెండు అంతకంటే ఎక్కువ వ్యాధులున్న 45 ఏండ్లు ఆపై వయస్కులకు ఈ నెల 1 నుంచి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అర్హులైనవారు టీకా వేయించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ సూచించింది.