హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని 12,260 దేవాలయాలోల ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ అర్చక సమాఖ్య తెలిపింది. శుక్రవారం మెదక్ జిల్లా శివ్వంపేట స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శనివారం అన్ని దేవాలయాల్లో దేవతావృక్షాలకు వృక్షార్చన నిర్వహిస్తామని అర్చక సమాఖ్య నేత గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.