హైదరాబాద్, జూన్ 18, (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ ముప్పును ప్రతిఘటించడంలో ప్రజలను, పారిశ్రామికవేత్తలను జాగృతం చేసేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ)కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. కొవిడ్ సమయంలో సురక్షితంగా ఉండాలంటే ప్రజలు ఏం చేయాలి? తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఏంటి? పారిశ్రామికవేత్తలు ఏవిధంగా ఉత్పత్తులను ప్రారంభించాలి? అనే అంశాలపై ఎఫ్టీసీసీఐ కార్యక్రమాలను నిర్వహించింది. ప్రభుత్వాధికారులు, వైద్యనిపుణులతో సెమినార్లు, ఫ్రంట్లైన్ వారియర్లకు స్టామినా బూస్టర్లను అందించడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. ఈ సేవలకు గుర్తింపుగా ఎఫ్టీసీసీఐ సీఈవో ఖ్యాతి అమోల్నరవాణెకు లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్ అవార్డును బహూకరించింది.