న్యూయార్క్, జూన్ 24:రోదసి నుంచి పుడమి అందాలను తనివితీరా చూడాలనుకునే ఆశ ఎవరికి ఉండదు? అయితే, రాకెట్లలో ప్రయాణం చేసే వ్యోమగాములకు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. విమానాల్లో వినువీధుల్లోకి వెళ్లినా.. ఆ దూరం భూ ఉపరితం నుంచి ఆరేడు మైళ్లు దాటదు. కానీ, రాకెట్ ఎక్కకుండా అంతరిక్షం నుంచి పృథ్వి సొగసులను చూసి మురిసిపోయే అరుదైన అవకాశం వచ్చేసింది. అవును. నిజం అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ‘స్పేస్ పర్స్పెక్టివ్’ అనే కంపెనీ ‘స్పేస్ బెలూన్’ పేరిట అవని అందాల్ని వీక్షించే అవకాశాన్ని తీసుకొచ్చింది. భూమికి 20 మైళ్ల కంటే ఎక్కువ ఎత్తులో వాతావరణంలోని స్ట్రాటో ఆవరణంలో విహారానికి తీసుకుపోయేందుకు ‘నెప్ట్యూన్ వన్ క్యాప్సుల్’ పేరిట ఫుట్బాల్ స్టేడియం సైజులో ఉండే స్పేస్ బెలూన్ను సిద్ధం చేసింది. ఏకకాలంలో దీంట్లో మొత్తం ఎనిమిది మంది ప్రయాణం చేయొచ్చు. ఆకాశంలోకి వెళ్లాక, 360 డిగ్రీల కోణంలో భూగ్రహం అందాలను చూడొచ్చు. 2024లో ప్రారంభంకానున్న ఈ యాత్రకు బుధవారం బుకింగ్ స్టార్ట్ అయింది. బుకింగ్ ప్రారంభం కాగానే తొలి మూడు ట్రిప్లకు టికెట్లు అయిపోయాయి. ఒక్కో టికెట్ ఖరీదు 1.25 లక్షల డాలర్లు (రూ. 92.69 లక్షలు).
వివరాలు సంక్షిప్తంగా
పేరు: నెప్ట్యూన్ వన్ క్యాప్సుల్
ప్రయాణ వ్యవధి: మొత్తం 6 గంటలు, స్ట్రాటో ఆవరణంలో 2 గంటల యాత్ర
పైనున్నప్పుడు బెలూన్ వేగం గంటకు 12 మీటర్లు
క్యాప్సుల్లో అందే సేవలు
అల్పాహారం, డ్రింక్స్, లైవ్ స్ట్రీమింగ్ రికార్డింగ్ కోసం వైఫై, బాత్రూమ్ సదుపాయాలు
విలాసం కోసం
యాత్రికుల ఆహ్లాదం కోసం బార్, రెస్టారెంట్, మ్యూజిక్, రిైక్లెనింగ్ సీట్లు
ఒక్కో టికెట్ ధర92.69లక్షలు