ఎల్లుండి సమాధానం ఇవ్వనున్న ప్రభుత్వం
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ, శాసనమండలిలో శనివారం బడ్జెట్పై చర్చించనున్నారు. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్నాయి. సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాలను చేపడుతారు. ప్రశ్నోత్తరాల్లో ప్రస్తుతం రోజుకు 6 ప్రశ్నలకు అవకాశం కల్పించారు. ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్పై చర్చ ప్రారంభమవుతుంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ ఎమ్మెస్ ప్రభాకర్ మాట్లాడుతారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం సభ వాయిదా పడనున్నది. బడ్జెట్పై చర్చకు సోమవారం ప్రభుత్వం సమాధానం ఇవ్వనున్నది.
మానవీయ బడ్జెట్
దేశానికి ఆదర్శ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ బడ్జెట్ను రూపొందించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. కరోనా కష్టకాలంలోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. మౌలికరంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల సంక్షేమానికి దీర్ఘకాలిక ప్రణాళికలే ప్రాతిపదికగా ప్రభుత్వం పనిచేస్తున్నట్టు బడ్జెట్ స్పష్టంచేసింది. అన్ని ప్రాంతాలకు సముచిత స్థానం కల్పించింది. విమానాశ్రయాల ఏర్పాటుకు ఊతమిచ్చేలా రూ.100 కోట్లు కేటాయించటం గొప్ప విషయం.