హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారిగా మహిళ భద్రత కోసం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన షీ టీమ్స్ పనితీరు పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతున్నది. షీ టీమ్స్ పనితీరుపై సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) చేపట్టిన సర్వే ఫలితాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. బాధితుల్లో 96% మంది షీ టీమ్స్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నదని తెలిపారు. షీ టీమ్స్ను ఆశ్రయించాక ఇబ్బందుల్లేకుండా సమస్య పరిష్కారమైందని 92% మంది తెలిపారు. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజల్లో 89% మందికి షీ టీమ్స్ అంటే ఏమిటి? అవి ఏం పనిచేస్తాయన్న విషయాలపై పూర్తి అవగాహన ఉన్నట్టు సర్వే వెల్లడించింది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్, విద్యార్థినుల్లో భరోసా పెరిగిందని తెలిపింది. బాధితులు నేరుగా వచ్చే అవసరం లేకుండానే ఫిర్యాదును స్వీకరించటం, వారి వివరాలు గోప్యంగా ఉంచటంతో బాధితుల్లో మరింత భరోసా పెరిగిందని వెల్లడించింది. ఈ ఏడాదిలో గత నెల 30 వరకు మొత్తం 2,803 ఫిర్యాదులు అందితే, అందులో వాట్సప్ ద్వారానే 1,400 వరకు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.
జనవరి 1- జూన్30 మధ్య నమోదైన కేసులు: