న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో ప్రధానంగా దేశంలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు, వైరస్ నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు.
ప్రధాని మోదీ గతంలో కూడా పలు సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఈ ఏడాది జనవరిలో చివరిసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.