తల్లీ కొడుకుల బంధాలను ఛిద్రం చేస్తున్న కరోనా వైరస్ చేదు అనుభవాలను మిగులుస్తుంది. అమ్మ చనిపోతే ఆమె కడుపున పుట్టిన బిడ్డలూ అంతిమ సంస్కారం నిర్వహించలేని దుస్థితిని కలిగిస్తున్నది.
ఖైరతాబాద్లోని లక్ష్మీనగర్కు చెందిన శ్రీ అంజనికి ముగ్గురు కుమారులు. తన చిన్న కొడుకు ప్రవీణ్ వద్దే ఉంటున్నది. ప్రవీణ్కు భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండు వారాల కిందట ప్రవీణ్తో పాటు ఆయన చిన్న కుమార్తెకు కరోనా సోకింది. దీంతో రెండో కుమార్తెను అమ్మమ్మ ఇంటికి పంపించగా, భార్య సుజా త ఇద్దరికీ సేవలందిస్తున్నది. అయితే కొడుకుకు కరోనా సోకడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేక ఆందోళనకు గురై.. శు క్రవారం గుండెపోటుతో కుప్పకూలిపోయింది. కరోనా పాజిటివ్ రావడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి ప్రవీణ్ది. దీంతో ఉప్పల్, గాంధీనగర్లోని తమ సోదరులకు సమాచారం అందించి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా అభ్యర్థించాడు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఉ న్న ఇంటికి తాము రామని, తల్లి కూడా కొవిడ్తోనే చనిపోయి ఉంటుందని అనుమానపడి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక ప్రవీణ్ స్థానిక మారుతీనగర్ బస్తీ అధ్యక్షుడు, శివలాల్ యాదవ్ చారిటుబల్ ట్రస్ట్ చైర్మన్ ఎం.మహేశ్ యాదవ్కు ఫోన్ ద్వారా సమాచా రం అందించాడు. వెంటనే స్పందించిన ట్రస్టు వారు వా రికి ఆర్థికంగా సాయం అందించడంతో పాటు సొంత ఖ ర్చులతో ఆమెను వాహనంలో పంజాగుట్ట శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. రక్తంపంచుకొని పుట్టిన బిడ్డలు, వారి కుటుంబ సభ్యులు కొవిడ్ పేరుతో దూరంగా ఉన్నా మానవత్వంతో ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించిన మహేశ్ యాదవ్కు ప్రవీణ్ నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలిపాడు.