హైదరాబాద్ : రాజేంద్రనగర్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్ 248 వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మహిళ శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున మహిళ ఒంటరిగా వెళ్తుంటే చూశామని కొందరు స్థానికులు చెప్పారు. మహిళది హత్య..? లేక ఆత్మహత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.