జయశంకర్ భూపాలపల్లి : టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (వి) చలి వాగు ఒడ్డున గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చలి వాగు ఒడ్డు వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతదేహం గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.