బెంగళూరు : కరోనా బాధితులకు సహాయం చేయడానికి దక్షిణాదికి చెందిన ఓ నటుడు అంబులెన్స్ డ్రైవర్గా మారిపోయారు. కరోనా పేషెంట్లను దవాఖానకు తీసుకెళ్లడం, దవాఖాన నుంచి ఇంటికి తీసుకెళ్లడం చేస్తూ శహబాష్ అనిపించుకుంటున్నారు సౌతిండియాకు చెందిన నటుడు అర్జున గౌడ.
యువరాథన, రుస్తోమ్ సినిమాలతో మంచి ఇమేజ్ను సంపాదించుకున్న అర్జున గౌడ.. ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్లో సభ్యుడిగా చేరి నిరేపేదలకు సేవలందిస్తున్నాడు. కరోనా సోకిన వారిని దవాఖానలకు తీసుకెళ్లడం, చనిపోయిన వారిని శ్మశాన వాటికకు తరలించడం వంటి పనులు చేస్తున్నాడు.
“నేను గత కొన్ని రోజులుగా బెంగళూరు వీధుల్లో ఉన్నాను. దాదాపు ఆరు మృతదేహాలను శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలను నిర్వర్తించాను” అని అర్జున్ గర్వంగా చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చినా, ఏ మతం వారైనా ప్రతి పేదవారికి సహాయం చేసేలా ముందుకొస్తున్నాం. సహాయం అందించేందుకు నగరం అంతటా ఎక్కడైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సినిమాల నిర్మాణం నిలిచిపోయినందున ఇకపై ఇలాంటి సేవలకే తన సమయాన్ని వెచ్చిస్తానని, ఈ రకం సేవలు అందించడంలో ఎంతో ఆనందం ఉన్నదని అర్జున్ గౌడ్ పేర్కొన్నారు.
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలయ్యాడు.. ఓ ఎమ్మెల్యే కథ
సినిమా మరిచిపోలేని మహా మనీషి.. చరిత్రలో ఈరోజు
సెంకాకు ద్వీపాన్ని సర్వే చేసిన చైనా.. మరోసారి జపాన్తో ఉద్రిక్తత
తక్కువ లక్షణాలున్న కరోనా రోగులపై ఈ ఔషధం ప్రభావవంతం: ఆయుష్ మంత్రిత్వ శాఖ
బోర్డర్ రోడ్ ఆర్గనేజన్లో తొలి మహిళా అధికారిగా వైశాలి నియామకం
ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
ఈ విటమిన్ సీ పండ్లు తినండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి..!
ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది ఇంటిపై ఎఫ్బీఐ దాడులు
అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ను ప్రయోగించిన చైనా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..