వారసుల్లో గెలుపోటములు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తలపడ్డ వారసుల్లో కొంతమంది విజయం సాధించగా, మరికొందరూ పరాజితులయ్యారు. ఓటరుదేవుళ్లను ప్రసన్నం చేసుకోవడంలో కొంతమంది సఫలంకాగా, ఇంకొందరు విఫలమయ్యారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అగ్రనేతల వారసులుగా బరిలో దిగగా, కొందరు మాత్రమే విజయతీరాలకు చేరుకొన్నారు.
* దివంగత బీజేపీ నేత ఆలె నరేంద్ర కోడలు ఆలె భాగ్యలక్ష్మి గౌలిపుర డివిజన్ నుంచి కమలం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఘనవిజయం సాధించారు. ఇక్కడ ఇది వరకు నరేంద్ర భార్య లలిత కార్పొరేటర్గా గెలుపొందగా, తాజాగా వారి కోడలు విజయం సాధించారు.
* ఆలె నరేంద్ర మేనల్లుడు ఏ వినయ్కుమార్ భార్య పావని గాంధీనగర్ నుంచి బరిలో దిగి, ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచిన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తమ్ముడి భార్య ముఠా పద్మను ఓడించారు.
* బంజారాహిల్స్ నుంచి ఇద్దరు వారుసులు తలపడ్డారు. టీఆర్ఎస్ లోక్సభాపక్షనేత కే కేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, గోల్కొండ సింహంగా పేరుగాంచిన దివంగత బీజేపీ నేత బద్దం బాల్రెడ్డి కుమారుడు తలపడగా విజయలక్ష్మి గెలిచారు.
* గడ్డిఅన్నారం నుంచి మున్సిపల్ మాజీ చైర్మన్ బద్దం సుభాష్రెడ్డి కుమారుడు బద్దం ప్రేమ్మహేశ్రెడ్డి విజ యం సాధించారు.
* ఖైరతాబాద్ సైతం వారసుల పోరుకు వేదికయ్యింది. ప్రజానేత పీ జనార్దన్రెడ్డి కుమార్తె విజయారెడ్డి టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్గా బరిలో దిగి, ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు సింగారి సుదర్శన్ కుమార్తె వీణామాధురిపై ఘనవిజయం సాధించారు.
* మేయర్ బొంతు రామ్మెహన్ భార్య శ్రీదేవి చర్లపల్లి నుంచి ఘనవిజయం సాధించారు.
* భారతీనగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి కోడ లు సింధు ఆదర్శ్రెడ్డి సిట్టింగ్ కార్పొరేటర్గా పోటీచేసి, తన పాత ప్రత్యర్థి బీజేపీ నేత అంజిరెడ్డి భార్య గోదావరిపై రెండోసారి విజయం సాధించారు.
* దివంగత మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతిరెడ్డి అల్వాల్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో గెలిచి, మరోసారి అదే స్థానంనుంచి గెలుపొందారు.
* మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్రెడ్డి రాంనగర్ డివిజన్ నుంచి రెండోసారి తలపడగా, బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజితులయ్యారు.
* కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందిత తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కవాడిగూడ నుంచి మరోమారు తలపడగా, గెలుపుతీరాలను చేరుకోలేకపోయారు.
* ఏఎస్రావునగర్లో సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్రెడ్డి కుమార్తె పజ్జూరి పావనీరెడ్డి రెండోసారి తలపడిగా, కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
* టీఆర్ఎస్ మరో కీలక నేత నందకిషోర్వ్యాస్ (బిలాల్) కుమార్తె పూజావ్యాస్ బిలాల్ బేగంబజార్ డివిజన్ నుంచి తొలిసారిగా ఎన్నికల్లో తలపడినా విజయం సాధించలేకపోయారు.
* ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి భార్య బేతి స్వప్నారెడ్డి సిట్టింగ్ కార్పొరేటర్గా హబ్సిగూడ నుంచి బరిలో దిగినా బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజితులయ్యారు.
* టీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జి రామ్మెహన్గౌడ్ భార్య లక్ష్మీప్రసన్న బీఎన్ రెడ్డినగర్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్గా బరిలో దిగి ఓటమి పాలయ్యారు.
తాజావార్తలు
- ఇలా పడుకుంటే నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు..
- ప్రదీప్ మాట్లాడుతుండగానే స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన నటి నందిత శ్వేత
- నందిగామ పంచాయతీ కార్యదర్శి, ఏపీఎం సస్పెండ్
- ఏపీలో కొత్తగా 158 మందికి కోరోనా
- తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది : సీఎం
- మహిళలు, పిల్లలపై హింసను ఎదుర్కొనేందుకు 'సంఘమిత్ర'
- బిజినెస్ ఫ్రెండ్లీకి దెబ్బ: ‘మహా’ సర్కార్కు జీఎం వార్నింగ్!
- పాలమూరు-రంగారెడ్డి’ని ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్
- 2020 లో జీవితం ఇంతేనయా! చిన్నారులు పాపం..