లక్నో : ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అయోధ్య జిల్లాలోని మిల్కిపూర్ తాలుకాలోని బారియా నిశారు గ్రామానికి చెందిన రమేశ్ కుమార్ (35) అనే వ్యక్తి తన మేనల్లుడు పవన్తో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే, మామా అల్లుళ్ల మధ్య భూ విషయంలో గొడవలున్నాయి. ఈ క్రమంలో అయితే.. మామా అల్లుడి మధ్య చాలా రోజులుగా ఓ భూమి విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ శనివారం రాత్రి రమేశ్ కుమార్, అతని భార్య జ్యోతి, ఇద్దరి కొడుకులు, కూతురు పదునైన కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.
అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా, ఎస్ఎస్పీ శైలేశ్ కుమార్ పాండే, ఎస్పీ శైలేంద్ర సింగ్ ఘటనాస్థలికి చేరుకొని, మృతదేహాలను పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు బృందాలు గాలిస్తున్నాయని శైలేష్ కుమార్ పాండే తెలిపారు. హత్యకు గురైన చిన్నారుల వయస్సు 4, 6, 8 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.