వరంగల్ అర్బన్ : రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హామీనిచ్చారు. గురువారం హన్మకొండలోని ఆయన నివాసంలో వినోద్ కుమార్ను కలిసి రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సమస్యలు తనకు తెలుసునని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు.
ప్రజలకు రేషన్ను సక్రమంగా అందజేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు మాట్లాడుతూ.. అర్హత లేని వ్యక్తులకు చెందిన రేషన్ కార్డులను ఏరివేసి ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిలగాని మోహన్, రమేష్, పలువురు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పరవళ్లు తొక్కుతున్న పొచ్చర జలపాతం
నరసింహులపల్లి సమస్యలను పరిష్కరిస్తా : మంత్రి కొప్పుల
టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్ రమణ?
బ్లాక్ ఫంగస్తో హెల్త్ సూపర్ వైజర్ మృతి