ప్రచారం: ‘వాట్సాప్ను రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిపివేస్తున్నట్టు కేంద్రం నిర్ణయించింది. వాట్సాప్ను యాక్టివ్ చేసుకోవాలంటే నెలవారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.
వాస్తవం: వాట్సాప్ నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇదంతా అబద్ధపు ప్రచారమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ట్విటర్ వేదికగా స్పష్టంచేసింది. వదంతులు నమ్మొద్దని ప్రజలకు సూచించింది.