హుజూరాబాద్టౌన్, ఆగస్టు 3: దళితులకు సీఎం కేసీఆర్ ఆత్మబంధువుగా మారారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ కొనియాడారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హు జూరాబాద్లో దళితబంధు చైతన్య కళాప్రదర్శన రథాలను ప్రారంభించా రు. మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దళితబంధు అమలుకు హుజూరాబాద్ ని యోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు, దళితులకు పిలుపునిచ్చారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరేందుకు దళితబంధు పథకం దోహదపడుతుందని, ఈ విషయంలో దళితు లు ఐక్యతను చాటిచెప్పాలని కోరారు.