బీర్కూర్, సెప్టెంబర్ 6 : దేశంలో ఎక్కడాలేని సంక్షేమపథకాలు తెలంగాణలో అమలు చేస్తుంటే.. కొన్ని పార్టీల నాయకులు మైకు దొరకగానే నరుకుతా, పొడుస్తామంటూ మాట్లాడుతున్నారని అసెంబ్లీ స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఏమిటో తెలియనివారు బాన్సువాడకు వస్తే తాను చూపిస్తానని.. కాదని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. సోమవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మం డలం దామరంచలో 10 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, 35 నిర్మాణాలకు భూమిపూజ చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. గ్రామంలో పెద్ద మనుషులుగా చెలామణిఅయిన కొందరు 10 మంది పేర్లమీద ఇండ్లను కట్టకుండానే దొంగ బిల్లులను తీసుకున్నారని మండిపడ్డారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు డబ్బులు పంచుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.