హరితహారం కార్యక్రమం ద్వారా సాధిస్తున్న ఫలితాలతో దేశానికే ఆదర్శంగా నిలిచాం. హరిత నిధికి విశేష స్పందన వస్తున్నది. అడవులను రక్షించుకొనే విషయంలో అటవీశాఖ అధికారులు మరింతగా శ్రద్ధ పెట్టాలి. సమర్థులైన అధికారులను నియమించాలి. వారికి ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుంది. అసెంబ్లీలో ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం పోడు భూముల సమస్యల పరిషారానికి ఈ నెల మూడోవారం నుంచి కార్యాచరణ ప్రారంభించండి.
–సీఎం కేసీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలో చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న పోడుభూముల సమస్యను అడవి బిడ్డలకు ఏమాత్రం ఇబ్బంది రాకుండా పరిష్కరించటంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దృష్టి సారించారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అసెంబ్లీలో శుక్రవారం ప్రకటించిన ఆయన, వెనువెంటనే అందుకు సంబంధించిన పనికి శ్రీకారం చుట్టారు. పోడు సమస్యపై ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు మార్గనిర్దేశంచేశారు. గిరిజనులతో అడవులకు ఎలాంటి ఇబ్బందిలేదని, బయటనుంచి వచ్చేవారితోనే అసలు సమస్య అని పేర్కొన్నారు. అడవుల రక్షణకు ఎలాంటి కఠినచర్యలకైనా వెనుకాడబోమని స్పష్టంచేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిషరించడానికి ఈ నెల మూడోవారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఈ వ్యవహారం ఓ కొలికి వచ్చిన తర్వాత ఒక గజం అటవీ భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని స్పష్టంచేశారు. ఆక్రమణలు అడ్డుకోవడానికి అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పోడు భూముల అంశంపై శనివారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, ఈ సమస్యను పరిషరించే క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అటవీ భూములు అన్యాక్రాంతమైన విధానాన్ని అవసరమైతే ప్రత్యక్షంగా చూపిస్తామని తెలిపారు. అటవీ పరిరక్షణ కమిటీలను నియమించేందుకు విధి విధానాలను తయారుచేయాలని అధికారులను అదేశించారు.
సమస్య అంతా బయటినుంచి పోయి అటవీ భూములను ఆక్రమించి, అడవిని నరికి, దుర్వినియోగం చేసేవారితోనే. వారి స్వార్థానికి అడవులను బలికానివ్వం. పోడు భూముల సమస్య పరిషారమైన మరుక్షణం నుంచే అటవీభూముల రక్షణ కోసం ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతుంది. ఆ తర్వాత అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లేకుండా చూసుకొనే బాధ్యత అటవీశాఖ అధికారులదే. అడవి తప్ప అడవిలో ఎవరూ ఉండటానికి వీల్లేదు
అడవుల నడిమధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని అడవి అంచుకు తరలిస్తామని, అక్కడే పోడు రైతులకు భూమిని కేటాయిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అట్లా తరలించిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి, వ్యవసాయానికి నీరు, కరెంటు వంటి వసతులు కల్పిస్తామని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా కూడా పోడు రైతులకు వర్తింపచేస్తామని వెల్లడించారు.
మానవ మనుగడకు అడవుల సంరక్షణ ఎంతో కీలకమని, నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలకు ఒక చెట్టూ మిగలదని సీఎం కేసీఆర్ అన్నారు. అడవుల రక్షణ, పచ్చదనం పెంచడంకోసం రాష్ట్రప్రభుత్వం చేపట్టిన చర్యలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. బయో డైవర్సిటీ కూడా పెరిగిందని పేర్కొన్నారు. ‘హరితహారం కార్యక్రమం ద్వారా సాధిస్తున్న ఫలితాలతో దేశానికే ఆదర్శంగా నిలిచాం. హరిత నిధికి విశేష స్పందన వస్తున్నది. అడవులను రక్షించుకొనే విషయంలో అటవీశాఖ అధికారులు మరింతగా శ్రద్ధ పెట్టాలి. సమర్థులైన అధికారులను నియమించాలి. వారికి ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుంది. అసెంబ్లీలో ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం పోడు భూముల సమస్యల పరిషారానికి అక్టోబర్ మూడోవారం నుంచి కార్యాచరణ ప్రారంభించండి’ అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
అడవిలో బయటినుంచి వచ్చేవారికి స్థానం లేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ‘అడవి బిడ్డలకు అడవుల మీద ప్రేమ ఉంటుంది. వారి జీవన సంస్కృతి అడవులతో ముడిపడి ఉంటుంది. వారు అడవులను ప్రాణంగా చూసుకొంటారు. అడవులకు హాని తలపెట్టరు. వారి జీవిక కోసం అడవుల్లో దొరికే తేనెపట్టు, బంక, పొయిల కట్టెలు వంటి అటవీ ఉత్పత్తుల కోసం మాత్రమే అడవులను ఉపయోగించుకొంటారు. ప్రభుత్వం వారి జీవన హకును కాపాడుతుంది. సమస్య అంతా బయటినుంచి పోయి అటవీ భూములను ఆక్రమించి, అడవిని నరికి, దుర్వినియోగం చేసేవారితోనే. వారి స్వార్థానికి అడవులను బలికానివ్వం. పోడు భూముల సమస్య పరిషారమైన మరుక్షణం నుంచే అటవీభూముల రక్షణ కోసం ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతుంది. ఆ తర్వాత అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లేకుండా చూసుకొనే బాధ్యత అటవీశాఖ అధికారులదే. అడవి తప్ప అడవిలో ఎవరూ ఉండటానికి వీల్లేదు’ అని సీఎం స్పష్టంచేశారు.
ఈ నెల మూడోవారంలో రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దరఖాస్తుల్లో పేరొన్న అంశాల ఆధారంగా వారి వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్థారించాలని సీఎస్ సోమేశ్కుమార్కు సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేల సూచనలు, సలహాలు తీసుకోవాలని, గిరిజన సంక్షేమశాఖ సమన్వయంతో అటవీశాఖ అధికారులు అటవీ భూముల రక్షణలో కీలకంగా పనిచేయాలని సూచించారు. నవంబర్ నుంచి అటవీ భూముల సర్వే ప్రారంభించనున్నట్టు సీఎం తెలిపారు. కోఆర్డినేట్స్ ద్వారా ప్రభుత్వ అటవీభూముల సరిహద్దులను గుర్తించాలని ఆదేశించారు. అవసరమైన మేరకు కందకాలు తవ్వి, కంచెవేసి పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం బడ్జెట్ను ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు. పకడ్బందీ చర్యల కోసం అవసరమైతే పోలీస్ భద్రత కల్పిస్తామని చెప్పారు. అంతిమంగా అందరి లక్ష్యం అడవులను పరిరక్షించుకోవటమే కావాలని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. సమావేశంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సకు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్రావు, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ శోభ, ఆర్ఎం డోబ్రియాల్, స్వర్గం శ్రీనివాస్, హైదరాబాద్ సరిల్ సీసీఎఫ్ అక్బర్, సీసీఎఫ్, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ రాజా రావు, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వర్రావు, ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.