సింగరేణి సీఎండీ శ్రీధర్
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న దృష్ట్యా ఆగస్టు నెలలో కనీసం 1.85 లక్షల టన్నులు ఉత్పత్తిని సాధించాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో మంగళవారం అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తి, రవాణాపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ శ్రీధర్ మాట్లాడుతూ.. రోజుకు కనీసం 2 లక్షల టన్నుల మేర డిమాండ్ ఉందని చెప్పారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తదితర రాష్ర్టాల నవుంచి డిమాండ్ ఉన్నందున సింగరేణి బొగ్గు ఉత్పత్తి పెంచాల్సి ఉందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కంపెనీ సాధించిన ఉత్పత్తి, రవాణాపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ నిర్దేశించుకున్న 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని పిలుపునిచ్చారు.