టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ధరావత్ భాస్కర్ హెచ్చరిక
మహబూబాబాద్: టీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుంటే.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సీఎం కేసీఆర్, పార్టీ నాయకులను విమర్శించడం సిగ్గుచేటని టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ధరావత్ భాస్కర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే చెప్పులతో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఆదివారం మహబూబాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మల్లన్న చిత్రపటానికి చెప్పుల దండవేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు జెల్లా వెంకటేశ్, ములకల నరేష్, దేవేందర్, నాగరాజు, ప్రసాద్ పాల్గొన్నారు.